ఫిల్మ్ ఇండస్ట్రీని వదలని విషాదాలు, టాలీవుడ్ సీనియర్ హీరో విద్యాసాగర్ కన్నుమూత

By Mahesh JujjuriFirst Published Aug 28, 2022, 8:24 PM IST
Highlights

అలనాటి అందాల హీరో....  ప్రముఖ సీనియర్‌ నటుడు విద్యాసాగర్‌ తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు టాలీవుడ్‌ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.
 

అలనాటి అందాల హీరో....  ప్రముఖ సీనియర్‌ నటుడు విద్యాసాగర్‌ తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు టాలీవుడ్‌ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.

వరుస విషాదాలు చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నాయి. వరుసగా ఇండస్ట్రీకి సంబంధంచిన పెద్దలు కన్నుమూస్తూ వస్తున్నారు. రీసెంట్ గా సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇండస్ట్రీకి చెందిన ఒకప్పటి హీరో విద్యాసాగర్  కన్నుమూశారు. గతంలో కొన్ని తెలుగు సినిమాల్లో హీరోగా నటించిన  విద్యాసాగర్.. ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. కెరీర్ మంచి ఊపులో ఉండగా అనరోగ్యం కబళించడంతో.. ఆయన వెండితెరకు దూరం అయ్యారు. 

ఈ చదువులు మాకొద్దు సినిమాతో వెండితెరకు  హీరోగా పరిచయమైన విద్యాసాగర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత కామెడీ బ్రహ్మాగా పేరు పొందిన  దర్శకుడు జంధ్యాల చేసిన అనేక సినిమాల్లో  కూడా విద్యాసాగర్ నటించారు. కొన్ని సినిమాలు చేసిన తర్వాత కెరీర్ మంచు పీక్స్ లో ఉండగా  ఆయనకు అనూహ్యంగా పక్షవాతం వచ్చింది. దీంతో ఒక కాలు ఒక చేయి పనిచేయలేదు. దీంతో ఆయన కేవలం వీల్ చెయిర్ కే పరిమితం అయ్యారు విద్యాసాగర్. అయితే అలా వీల్ చెయిర్ కు పరిమితమైన సరే ఆయన వీల్ చైర్ లో కూర్చుని పలు సినిమాల్లో నటించారు. 

అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. సీనియర్ నటి రత్నా సాగర్ విద్యాసాగర్ భార్య. వీరిద్దరు నటనరంగంనుంచి సినిమా రంగానికి వచ్చి అనేక సినిమాల్లో తమ ప్రతిభ చాటుకున్నారు.   అయితే విద్యాసాగర్ ఎలా మరణించారనే విషయం మీద ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఆయన మరణ వార్త సినీ నటుడు జోష్ రవి తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. విద్యా సాగర్ రావు మరణ వార్త తెలుసుకున్న పలువురు ఆయన మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు  నివాళులు అర్పిస్తూ పోస్టులు పెడుతున్నారు.
 

click me!