సంక్రాంతి కానుకగా విడుదల కానున్న రాధే శ్యామ్ చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా మూవీగా దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో రాధే శ్యామ్ చిత్రం తెరకెక్కుతుంది.
నేడు కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాధే శ్యామ్ టీమ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చారు. ఆ సినిమా నుండి కొత్త పోస్టర్ విడుదల చేశారు. పూజా హెగ్డే, ప్రభాస్ లతో కూడిన న్యూ పోస్టర్ అద్భుతంగా ఉంది. బ్లూ లాంగ్ ఫ్రాక్ ధరించి ఉన్న పూజా హెగ్డే పియానో ప్లే చేస్తుంటే.. టాక్సడో ధరించి ఉన్న ప్రభాస్ జెంటిల్ గెటప్ లో ఆమె పక్కనే ఉండి, మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారు. రాధే శ్యామ్ న్యూ పోస్టర్ చాలా గ్రాండ్ గా ఉంది.
సంక్రాంతి కానుకగా విడుదల కానున్న రాధే శ్యామ్ చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా మూవీగా దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో రాధే శ్యామ్ చిత్రం తెరకెక్కుతుంది. జిల్ ఫేమ్ దర్శకుడు రాధా కృష్ణ పీరియాడిక్ సెన్సిబుల్ లవ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. సినిమా అధిక భాగం ఇటలీ నేపథ్యంలో సాగుతుందని సమాచారం.
రాధే శ్యామ్ మూవీ పునర్జన్మల కాన్సెప్ట్ తో తెరకెక్కతున్నట్లు మరో ప్రచారం ఉంది. ఏది ఏమైనా ప్రభాస్ నుండి ఓ వినూత్నమైన చిత్రంగా రాధే శ్యామ్ ఉండనుంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ఈ మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు.
మరో వైపు ప్రభాస్ ఆదిపురుష్, సలార్ చిత్రాల షూటింగ్స్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ రెండు చిత్రాలు కూడా సెట్స్ పై ఉండగా, ప్రభాస్ పాల్గొంటున్నారు. ఇక సలార్ 2022 సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ చిత్రం పై ఫ్యాన్స్ లో అమితాసక్తి నెలకొని ఉంది.
As we celebrate Janmashtami, let Vikramaditya and Prerna teach you a new meaning of love! 💕
Here's wishing you all a very Happy Janmashtami!
Starring & pic.twitter.com/LqTUgADq7Q