గోపీచంద్ డైరెక్షన్ లో బాలయ్య 'రౌడీయిజం'?

By team teluguFirst Published Sep 13, 2021, 9:21 AM IST
Highlights

బాలయ్యతో గోపీచంద్ చేసే చిత్ర కథపై ఇప్పటికే కొన్ని కథనాలు తెరపైకి వచ్చాయి. తాజాగా మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది. బాలయ్య కోసం గోపీచంద్ మలినేని పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ రచయిత రాసిన కథను ఎంచుకున్నారట.

నటసింహం బాలయ్య తన స్థాయి హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు రేంజ్ హిట్ ఆయనకు మరలా దక్కలేదు. థియేటర్ లో బాలయ్య ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయే మాస్ సినిమా ఎప్పుడు వస్తుందా అని, అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అది అఖండ అవుతుందని చాలా మంది విశ్వసిస్తున్నారు. కారణం.. అఖండ చిత్రానికి దర్శకుడు బోయపాటి శ్రీను కాగా... గతంలో బాలయ్యకు సింహ, లెజెండ్ వంటి రెండు హిట్స్ ఇచ్చాడు. 


షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న అఖండ విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా అఖండ తర్వాత బాలయ్య దర్శకుడు గోపీచంద్ మలినేనితో మూవీ ప్రకటించారు. క్రాక్ మూవీతో ఒక్కసారిగా రేసులోకి వచ్చిన గోపీచంద్ మలినేనితో మూవీ చేయాలని, బాలయ్య ఫిక్స్ అయ్యారు. అందుకే పిలిచి మరీ అతనికి అవకాశం ఇచ్చాడు. 


బాలయ్యతో గోపీచంద్ చేసే చిత్ర కథపై ఇప్పటికే కొన్ని కథనాలు తెరపైకి వచ్చాయి. తాజాగా మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది. బాలయ్య కోసం గోపీచంద్ మలినేని పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ రచయిత రాసిన కథను ఎంచుకున్నారట. ఈ మూవీలో బాలయ్య ఫ్యాక్షనిస్ట్ గా, పోలీస్ ఆఫీసర్ గా రెండు భిన్న పాత్రలలో కనిపిస్తారట. అలాగే ఈ మూవీకి రౌడీయిజం అనే టైటిల్ అనుకుంటున్నారని, ఈ టైటిల్ ని బోయపాటి ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించారనేది టాక్. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తుంది. బాలయ్య ఇమేజ్ కి తగ్గట్టు ఉన్న మాస్ పవర్ ఫుల్ టైటిల్ రౌడీయిజం... మాత్రం అదిరిపోయింది. 


 

click me!