కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ కేసులో మాదకద్రవ్యాల ముఠాలతో సంబంధాలున్నాయని ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ నియమించిన సిట్ నోటీసులు అందుకుని.. సిట్ విచారణకు హాజరైంది హీరోయిన్ చార్మి.ప్రస్థుతం పూరీ కనెక్ట్స్ తో వ్యాపార భాగస్వామ్యం నిర్వహిస్తున్న చార్మి.. డ్రగ్స్ వ్యవహారంలో తీవ్ర మనోవేదనకు గురైంది. తన కుటుంబమంతా ఈ వ్యవహారంతో చార్మికకి సంబంధంలేదని చెప్తూ... ఏం జరుగుతుందోనని చాలా ఆందోళన పడ్డారు.
అయితే సిట్ విచారణకు హాజరయ్యే ముందే హైకోర్టును ఆశ్రయించి.. తన హక్కులకు భంగం వాటిల్లకుండా విచారిస్తే సహకరిస్తానని చార్మి హైకోర్టు నుంది ఆ మేరకు ఆదేశాలు తెచ్చుకుంది. సిట్ విచారణ ముగిసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లకు ఝాన్సీ లక్ష్మిబాయిలానూ కనిపించింది చార్మి. మొత్తానికి సిట్ విచారణ అనంతరం పెను తుఫాను బారి నుంచి బయటపడినట్లుందంటూ ట్వీట్ చేసిన చార్మి ప్రస్థుతం ప్రశాంతంగా తన లైఫ్ లీడ్ చేస్తోంది.
ఈ సారి రాఖీ పండగను చార్మి ఘనంగా జరుపుకుంది. తన సోదరుడు రాఖీ పండగ సందర్భంగా రాఖీ కట్టించుకుని సరదాగా వున్నారు. చార్మి కూడా రాఖీ పండగ సందర్భంగా యూరప్ నుంచి ఓ గిఫ్ట్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇంతకీ అన్నయ్య తెచ్చిన గిఫ్ట్ ఏంటో చెప్పనేలేదు చార్మి.