ఆ పాట విని అమ్మ ఏడ్చేసింది: ఎన్టీఆర్!

By Udayavani DhuliFirst Published Oct 6, 2018, 12:08 PM IST
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో పాటలు ఆడియన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాయి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో పాటలు ఆడియన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాయి.

ముఖ్యంగా 'పెనివిటి' అనే పాట హృదయాలను హత్తుకునేలా ఉంది. ఇదే విషయం ఎన్టీఆర్ వద్ద ప్రస్తావించగా.. ''షాకింగ్ విషయం ఏమిటంటే ఆ పాట మా నాన్నగారు చనిపోయిన తరువాత చిత్రీకరించారు. ఆ పాట విన్న తరువాత మా అమ్మ ఏడవడం నేను చూశాను. నాన్నగారు చనిపోయిన తరువాత అమ్మ, నేను మెంటల్ గా మరింత స్ట్రాంగ్ అయ్యాం.

ప్రస్తుతం మా కుటుంబంలో ఉన్న పరిస్థితుల కారణంగా మా ఫ్యామిలీ మొత్తం ఈ పాటకి బాగా కనెక్ట్ అయింది. అరవింద సమేత సినిమా తనలో చాలా మార్పులు తీసుకొచ్చిందని, సినిమాలో కొన్ని పాత్రలు తన మార్పుకి కారణమని'' వెల్లడించారు.

రాజమౌళి సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో ఇంకా స్పష్టం రాలేదని.. ఇండియన్ సినిమాలలో అతి పెద్ద ప్రాజెక్ట్ గా సినిమా తెరకెక్కుతుందని అంచనాలను పెంచేశారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు అట్లీ డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. 
 

ఇవి కూడా చదవండి.. 

'అరవింద సమేత'లో ఎన్టీఆర్ అభిమానులు ఊహించని సర్ప్రైజ్!

'అరవింద సమేత'పై మహేష్ బాబు కన్ను!

'అరవింద సమేత'కి పవన్ ఫ్యాన్స్ సపోర్ట్.. కారణమదేనా..?

'అరవింద సమేత'లో నో ఫన్.. ఓన్లీ యాక్షన్!

'అరవింద సమేత' ట్రైలర్.. యూట్యూబ్ లో రికార్డుల మోత!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై 'అరవింద సమేత' హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మా నాన్నకిచ్చిన మాట మీకిస్తున్నా.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్!

click me!