ఎసిబి వర్సెస్ రిజిస్ట్రేషన్ శాఖ... పోలీస్ బాస్‌పై సస్పెన్షన్ వేటు

By Arun Kumar PFirst Published Oct 30, 2019, 5:12 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో రెండు ప్రభుత్వ శాఖల మధ్య గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. విశాఖలోని స్టాంప్స్ ఆండ్ రిజిస్ట్రేషన్  కార్యాలయంపై ఏసిబి దాడులు జరపడం వివాదానికి కారణమయ్యింది.   

అమరావతి:  విశాఖ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డిఐజి రవీంద్రనాథ్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై జరిగిన ఎసిబి దాడి వ్యవహారంలో రవీంద్రనాథ్ పాత్ర ఉండడంతో సస్పెండ్ కుమ గురయినట్లు తెలుస్తోంది. సంబంధిత మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల మధురవాడ సబ్ రిజస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా సాగిన విషయం తెలిసిందే. ఈ నెల 9వ తేదీన స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసిబి అధికారులు ఆకస్మికంగా దాడులు చేపట్టింది. ఈ దాడిలో పలు కీలకమైన డాక్యుమెంట్స్ తో పాటు కొంత నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ తారుకేశు పై చర్యలు తీసుకున్నారు. 

అయితే తనను కావాలనే కొంతమంది ఇలా ఏసిబి వద్ద ఇరికించారని సదరు రిజిస్ట్రార్ సంబంధిత శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించి సిసి కెమెరా పుటేజీలను కూడా మంత్రికి సమర్పించారు. దీంతో ఏసిబి అధికారులపై తీరుపై ఫైర్ అయిన మంత్రి విశాఖ ఏసిబి చీఫ్ కు ఫిర్యాదు చేశారు. 

read  more   సబ్ రిజిస్ట్రార్ ఇళ్లపై ఎసిబి దాడి: రు. 50 కోట్ల ఆస్తి

కొందరు ఏసీబీ అధికారులు దారి దోపిడీ దొంగల్లా తయారయ్యారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిని అరికట్టే వారే లంచాలకు అలవాటుపడి అడ్డదారులు తొక్కడం దారుణమన్నారు. ప్రస్తుత ఏసీబీ అధికారుల పని తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోందని మంత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు. 

ఇప్పటికే ఈ విభాగంలో జరుగుతున్న అవినీతిపై ఏసీబీ డీజీ,హోం మంత్రితోనూ మాట్లాడినట్లు తెలిపారు. పలు కేసుల్లో విచారణే అవసరం లేకుండా పూర్తి సాక్ష్యాధారాలున్నా ఏసిబి అధికారులు పట్టించుకోకుండా నిందితులతో బేరసారాలు జరుపుతున్నట్లు ఆరోపించారు. కాబట్టి తప్పు చేసిన వారిపై ఎలాంటి కేసులు పెడతారో.. ఏసీబీ అధికారులపై కూడా అలాగే కేసులు పెట్టాలని సూచించారు.

read more ఏసిబి అధికారులా.... దారి దోపిడీ దొంగలా...: పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫైర్

తప్పు చేసిన ఏసీబీ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టడమే కాకుండా సస్పెండ్ చేయాలన్నారు. లంచాలు ఇవ్వని అధికారులపై తప్పుడు కేసులు బనాయిస్తారా..? అని ప్రశ్నించారు. 

ఏపీపీఎస్సీ నుంచి డైరెక్టుగా రిక్రూట్ అయిన వాళ్లు పారదర్శకంగా వ్యవహరిస్తుంటే... మా శాఖకు చెందిన కొందరు కుమ్మక్కై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని అన్నారు. విశాఖ రేంజ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల డీఐజీ రవీంద్రనాథ్ని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నామని మంత్రి ప్రకటించారు. 

 

click me!