‘రాహుల్, ప్లీజ్ ఈరోజు సరిగా ఆడకు... ధోనీ భయ్యా, ఈ ఒక్క మ్యాచ్ మాకు వదిలేయండి’...

By Chinthakindhi RamuFirst Published Oct 24, 2021, 4:23 PM IST
Highlights

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ: కెఎల్ రాహుల్‌ను ‘రాహుల్... రాహుల్.. ప్లీజ్ ఈ రోజు సరిగా ఆడకు... ప్లీజ్’ అంటూ రిక్వెస్ట్ చేసిన ఓ పాక్ మహిళా విలేకరి... సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్న వీడియో...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో మోస్ట్ వెయిటింగ్, క్రేజీ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. దాయాదుల మధ్య రెండేళ్ల తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్‌కి ముందు భారీ హైప్ క్రియేట్ అయ్యింది...
ఆ క్రేజ్‌ని మరింత పెంచేందుకు ‘మోకా... మోకా’ యాడ్‌తో మోత మోగిస్తున్నారు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ నిర్వహకులు. ‘ఫైనల్‌కి ముందు జరుగుతున్న మెగా ఫైనల్ మ్యాచ్‌’గా అభివర్ణిస్తూ మోత మోగిస్తుననారు... టీ20 వరల్డ్‌కప్ టైటిల్ గెలవకపోయినా పర్లేదు, ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలని కోరుకుంటున్నారు చాలామంది క్రికెట్ ఫ్యాన్స్.

Pakistani anchor asking KL Rahul & MS Dhoni not to play well tomorrow 😭🤣Lol pic.twitter.com/JaxdqpHZqV

— Ash MSDian 🦁💛 (@savageheartttt)

ఈ రోజు మ్యాచ్‌లో విరాట్ సేన విజయం సాధించాలని కోరుకుంటూ హోమాలు, పూజలు నిర్వహిస్తున్నారు అభిమానులు. మిగిలిన దేశాలతో మ్యాచ్ గెలవడంతో కేవలం టోర్నీలో భాగంగానే భావించే భారతీయులు, పాక్‌తో మ్యాచ్ విషయానికి వచ్చే సరికి... దీన్ని కేవలం ఓ ఆటగా కాకుండా అభిమానంగా, పరువుకి సంబంధించిన విషయంగా భావిస్తారు...

పాకిస్తాన్‌లో దాదాపు సేమ్ సీన్. భారత జట్టు ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు పాక్ జనాలు, ఎలాగైనా ఇండియాపై విజయం సాధించాలని వేడుకుంటున్నారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌ను ఓడించినందుకు ఎన్నోసార్లు దాన్ని గర్వంగా చెప్పుకున్న పాక్ క్రికెటర్లు, ఈ మ్యాచ్ గెలిస్తే... ఆ తర్వాత నమీబియా, స్కాట్లాండ్ వంటి దేశాల చేతుల్లో ఓడినా పెద్దగా ఫీల్ కారు.

అందుకే మ్యాచ్‌కి ముందు ఎమోషనల్‌గా కూడా భారత క్రికెటర్లను ఒత్తిడిలోకి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు కొందరు పాక్ మీడియా జనాలు. తాజాగా భారత జట్టు ప్రాక్టీస్ చేస్తున్న మైదానంలోకి వచ్చిన కొందరు పాక్ విలేఖరులు... భారత క్రికెటర్లతో మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...

ఐపీఎల్‌లో 600+పరుగులు చేసి, వార్మప్ మ్యాచుల్లోనూ ఆకట్టుకున్న కెఎల్ రాహుల్‌ను ‘రాహుల్... రాహుల్.. ప్లీజ్ ఈ రోజు సరిగా ఆడకు... ప్లీజ్’ అంటూ ఓ పాక్ మహిళా విలేకరి రిక్వెస్ట్ చేస్తున్న వీడియో, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...

రాహుల్‌తో పాటు ఉన్న మెంటర్ ఎమ్మెస్ ధోనీని మరో పాక్ విలేకరి... ‘ధోనీ భయ్యా, ప్లీజ్ ఈ ఒక్క మ్యాచ్ వదిలేయండి...’ అంటూ కోరాడు... ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ఆడి గెలవలేక, ఇలా సరిగా ఆడకండని వేడుకుంటున్నారా? అంటూ పాకిస్తాన్‌ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు టీమిండియా అభిమానులు...

click me!