IPL 2024 Auction : ఐపీఎల్ వేలంలో ఏ ఆటగాడు ఎంత ధర పలికాడంటే ? జట్టు వారీగా వివరాలు..

By Sairam IndurFirst Published Dec 19, 2023, 5:05 PM IST
Highlights

IPL 2024 Auction : క్రికెట్ అభిమానులకు పండగలాంటి ఐపీఎల్ 2024 (IPL 2024) మరి మూడు నెలల్లో ప్రారంభం కానుంది. దీని కోసం ఆటగాళ్లను కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభమయ్యింది. దుబాయ్‌లో మంగళవారం గ్రాండ్ గా మొదలైన ఈ వేలంలో (IPL 2024 Auction) ఎవరు ఎంత ధర పలికారంటే ? 

IPL 2024 Auction : ఐపీఎల్ 2024 కోసం దుబాయ్‌లో అట్టహాసంగా మంగళవారం వేలం ప్రారంభమైంది. ఈ వేలంలో వెస్టిండీస్ ఆటగాడు రోవ్‌మన్ పావెల్ వేలంలో తొలి ఆటగాడిగా నిలిచాడు. అతడిని వేలం వేయడానికి కోల్‌కతా, రాజస్థాన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరకు రూ.7.40 కోట్లకు రోవ్‌మన్ పావెల్‌ను రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. వేలంలో అతడి పక్కనే వచ్చిన దక్షిణాఫ్రికా ప్లేయర్ రిలే రోసోను వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయలేదు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ రూ. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును 4 కోట్లకు దక్కించుకున్నది. 

IPL 2024 Auction : గెరాల్డ్ కోట్జీని కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్.. ఎన్ని కోట్లు అంటే ?

Latest Videos

ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్‌ను కొనుగోలు చేసేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీపడ్డాయి. చివరికి ట్రావిస్ హెడ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.6.80 కోట్లకు కొనుగోలు చేసింది. అతడి తర్వాత వేలానికి వచ్చిన భారత ఆటగాడు కరుణ్ నాయర్, ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్, మనీష్ పాండేలను ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు. 

శ్రీలంక ఆల్‌రౌండర్ హజరంగను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 1.50 కోట్ల బేస్ ఫీజుకు తీసుకుంది. న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్రను చెన్నై సూపర్ కింగ్స్ రూ.1.80 కోట్లకు కొనుగోలు చేసింది. భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను కూడా చెన్నై సూపర్ కింగ్స్ రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ అస్మదుల్లా ఒమర్జాయ్ తన బేస్ ధర రూ. 50 లక్షలకు గుజరాత్ టైటాన్స్ జట్టును కొనుగోలు చేసింది.

ఐపీఎల్ 2024లో కొత్త రూల్.. బౌలర్లకు మరో అస్త్రం.. బ్యాటర్లకు చుక్కలే..

ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ పాట్ కమిన్స్ కోసం ముంబై, చెన్నై జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. ముంబై రూ. 4.80 కోట్లు పడిపోయిన తర్వాత, బెంగళూరు అతడి కోసం వేలం వేయడం ప్రారంభించింది. వీరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. హఠాత్తుగా వేలంలోకి అడుగుపెట్టిన సన్ రైజర్స్.. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ పాట్ కమిన్స్ ను రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసింది. సామ్ కరణ్ గత ఏడాది రూ. 18.5 కోట్లకు వేలం వేయగా, ఇది ఐపీఎల్ చరిత్రలో ఒక ఆటగాడికి అత్యధిక ధర పలికింది. పాట్ కమిన్స్ దానిని బ్రేక్ చేశాడు. 

IPL 2024 Auction: మిచెల్ స్టార్క్ దెబ్బ‌.. ఐపీఎల్ అబ్బ.. అత్యంత ఖరీదైన ప్లేయర్ ఇతనే..

దక్షిణాఫ్రికా ఆటగాడు గెరాల్డ్ కోయెట్జీని ముంబై ఇండియన్స్ రూ.5 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో వారి ఆల్ రౌండర్ లైనప్ మరింత బలపడింది. భారత ఆటగాడు హర్షల్ పటేల్‌ను పంజాబ్ కింగ్స్ రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది. న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్‌ను కొనుగోలు చేసేందుకు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్ర పోటీ ఏర్పడినప్పుడు, చెన్నై సూపర్ కింగ్స్ చివరకు 14 కోట్లకు కొనుగోలు చేసింది. రెండో సెట్ ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఆటగాడు క్రిస్ వోక్స్‌ను పంజాబ్ 4.20 కోట్లకు దక్కించుకున్నది.

click me!