వైజాగ్ టెస్టులో ఇంగ్లాండ్ ను మట్టికరిపించిన భారత్..

Published : Feb 05, 2024, 02:16 PM ISTUpdated : Feb 05, 2024, 02:23 PM IST
వైజాగ్ టెస్టులో ఇంగ్లాండ్ ను మట్టికరిపించిన భారత్..

సారాంశం

India vs England: భార‌త్-ఇంగ్లాండ్ రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్ బౌలింగ్ లో రాణించిన భారత్.. వైజాగ్ లో ఇంగ్లాండ్ ను మట్టికరిపించింది. దీంతో 5 టెస్టుల సిరీస్ లో 1-1తో ఇరు జ‌ట్లు స‌మంగా ఉన్నాయి.   

India vs England: విశాఖ‌లో జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాండ్ రెండో టెస్టులో టీమిండియా అద్భుత‌మైన ఆట‌తీరును క‌న‌బ‌ర్చింది.  రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్ బౌలింగ్ లో రాణించిన భారత్.. వైజాగ్ లో ఇంగ్లాండ్ ను మట్టికరిపించింది. దీంతో 5 టెస్టుల సిరీస్ లో 1-1తో ఇరు జ‌ట్లు స‌మంగా ఉన్నాయి. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 396 ప‌రుగులు, రెండో ఇన్నింగ్స్ లో 255 ప‌రుగులు చేసింది. ఇక ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 253 ప‌రుగులు చేయ‌గా, రెండో ఇన్నింగ్స్ లో 292 ప‌రుగులకు ఆలౌట్ అయింది. దీంతో భార‌త్ 106 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాట‌ర్స్ లో జాక్ క్రాలే 73 ప‌రుగులు చేశాడు. భార‌త బౌల‌ర్ల‌లో అశ్విన్ 3, జ‌స్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీసుకున్నాడు. మిగ‌తా బౌల‌ర్లు తలా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు.  భారత్ తొలి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ 209 పరుగులతో తన కెరీర్ లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. జేమ్స్ ఆండర్సన్ 3,షోయబ్ బషీర్ 3, రెహాన్ అహ్మద్ 3 వికెట్లు తీసుకున్నారు. ఇంగ్లాండ్ తోలి ఇన్నింగ్స్ లో జాక్ క్రాలే 76 పరుగులు చేయగా, బెన్ స్టోక్స్ 47 పరుగులతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా అద్భుత‌మైన బౌలింగ్ లో ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల‌ను దెబ్బ‌కొట్టాడు. బుమ్రా ఆరు వికెట్లు తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసుకున్నాడు.

ఎలా ఆడేది గురూ నువ్వు ఇలా బాల్ వేస్తే.. బుమ్రా బౌలింగ్ తో బెన్ స్టోక్స్ కు దిమ్మదిరిగిపోయింది.. వీడియో !

 

అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్టిన రోహిత్ శ‌ర్మ‌.. బ్యాట్స్‌మన్ షాక్.. అశ్విన్ ఆశ్చర్యం ! 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ