రైల్వే జోన్ కోసం 52.22 ఎకరాలు సిద్దంగా ఉంది: విశాఖ కలెక్టర్ మల్లికార్జున

By narsimha lodeFirst Published Feb 2, 2024, 2:04 PM IST
Highlights

విశాఖపట్టణంలో  రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి  క్లియర్ టైటిల్ తో  52.22 ఎకరాల భూమి సిద్దంగా ఉందని  రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

విశాఖపట్టణం:  విశాఖపట్టణంలో  రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి  ఈ ఏడాది జనవరిలోనే  భూమిని సిద్దంగా ఉంచామని  అధికారులు ప్రకటించారు. విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటుకు  సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే  పనులు ప్రారంభిస్తామని  కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్ ఈ నెల  1వ తేదీన ప్రకటించారు.ఈ విషయమై  విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ మల్లికార్జున  స్పందించారు. 

విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి  అవసరమైన  52.22 ఎకరాల భూమి సిద్దం చేసినట్టుగా కలెక్టర్  తెలిపారు. ఈ విషయమై  రైల్వేశాఖకు  లేఖ రాసినా కూడ స్పందించలేదని కలెక్టర్   మాట్లాడారు. 

రైల్వే జోన్ ఏర్పాటు విషయమై భూమి కేటాయింపు విషయమై  ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. క్లియర్ టైటిల్ ఉన్న భూమిగా కలెక్టర్  పేర్కొన్నారు. ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కలెక్టర్ ఈ విషయాలను పేర్కొన్నారు.

also read:Union Budget 2024: 'విశాఖపట్టణంలో రైల్వేజోన్‌ ఏర్పాటుపై కేంద్రం స్పష్టత'

సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ను విశాఖపట్టణంలో ఏర్పాటు చేసేందుకు  డీపీఆర్, నిధులు కూడ సిద్దంగా ఉన్నట్టుగా కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ చెప్పారు. అయితే  రాష్ట్ర ప్రభుత్వం భూమిని తమకు కేటాయిస్తే  ఈ పనులు ప్రారంభిస్తామన్నారు. 

అయితే రైల్వేశాఖకు  నెల రోజుల క్రితమే ఈ విషయమై  లేఖ పంపినట్టుగా విశాఖపట్టణం కలెక్టర్  స్పష్టం చేశారు. ఈ విషయమై  రైల్వే శాఖ ఉన్నతాధికారులతో కూడ  ఫోన్ లో కూడ సంప్రదింపులు జరిపిన విషయాన్ని కూడ ఆయన ఆ ఇంటర్వ్యూలో గుర్తు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు సంస్థలు ఇస్తామని  అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీల్లో భాగంగానే  విశాఖపట్టణంలో ప్రత్యేక రైల్వే జోన్ కూడ ఉంది.  అయితే  రాష్ట్ర విభజన జరిగిన పదేళ్లు జరుగుతున్న ఈ చట్టంలో పొందుపర్చిన అంశాలు ఇంకా  అమలు కాని పరిస్థితి నెలకొంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం  కేంద్ర ప్రభుత్వం  అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో ఈ కమిటీ తరచుగా సమావేశాలు నిర్వహిస్తుంది. 

click me!