తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని హీరోయిన్ జాన్వీ కపూర్ అలిపిరి కాలినడకన వెళ్లి దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.