శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని తెలుగు జాతి ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన నిరాహార దీక్ష, త్యాగం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని సీఎం అన్నారు. తెలుగు ప్రజల ఐక్యత, అభివృద్ధికి ఆయన చూపిన మార్గం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలిపారు.