తెల్లారితే పెళ్లి.. కళ్యాణమండపం నుంచి వధువు జంప్.. ఆ తరువాతే అసలు ట్విస్ట్....

By AN TeluguFirst Published Nov 15, 2021, 7:31 AM IST
Highlights

తెల్లవారుజామున గుర్తించిన కుటుంబసభ్యులు ఆమె కోసం వెతికారు. ఆచూకీ దొరక్కపోవడంతో ఆమె తల్లిదండ్రులు, పెళ్లి కుమారుడు, బంధువులు twotown police station వెళ్లి ఫిర్యాదు చేశారు. వారంతా స్టేషన్ వద్దే ఉన్నారు. ఇంతలో కనిపించకుండా పోయిన ఆ వధువు మరో యువకుడిని పెళ్లి చేసుకుని అక్కడికి వచ్చింది.

మదనపల్లె : నాలుగైదు గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా కల్యాణ మండపం నుంచి వధువు పరారయ్యింది. మరో వ్యక్తి పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆదివారం చోటు చేసుకుంది. 

మదనపల్లెకు చెందిన యువకుడికి, అదే మండలానికి చెందిన యువతికి పెద్దలు నెల క్రితం వివాహం నిశ్చయం చేశారు. శనివారం రాత్రి స్థానిక marriage hallలో విందు ఏర్పాటు చేసి అక్కడే వధూవరులకు నలుగు పెట్టారు. ఆదివారం ఉదయం 5.30 గంటలు పెళ్లి జరగాల్సి ఉంది. కాగా, శనివారం అర్థరాత్రి bride మండపం నుంచి వెళ్లిపోయింది. 

తెల్లవారుజామున గుర్తించిన కుటుంబసభ్యులు ఆమె కోసం వెతికారు. ఆచూకీ దొరక్కపోవడంతో ఆమె తల్లిదండ్రులు, పెళ్లి కుమారుడు, బంధువులు twotown police station వెళ్లి ఫిర్యాదు చేశారు. వారంతా స్టేషన్ వద్దే ఉన్నారు. ఇంతలో కనిపించకుండా పోయిన ఆ వధువు మరో యువకుడిని పెళ్లి చేసుకుని అక్కడికి వచ్చింది.

మహారాష్ట్రలో దారుణం.. మైనర్ బాలికపై పోలీసు సహా 400 మంది రేప్

తమకు security కల్పించాలని పోలీసులను కోరింది. యువతి మేజర్ కావడతో ఆమె ఇష్టప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని పోలీసులు చెప్పారు. వధువు మాట్లాడుతూ.. ‘ఇష్టంలేని వివాహం చేస్తున్నారని ఈ నెల 3న డయల్ 100కు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి నా parentsతో మాట్లాడు. అప్పుడు పెళ్లి చేయమని పోలీసులకు చెప్పారు. ఆ తరువాత నన్ను house arrest చేశారు. అందుకే వివాహ సమయంలో అందరూ పడుకున్నాక వెళ్లాను. నేను ప్రేమించిన వ్యక్తిని పుంగనూరులో పెళ్లి చేసుకున్నా’ అని తెలిపింది. 

హోటల్ గదిలో ప్రేయసిపై పెట్రోల్ పోసి....

ఓ యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన యువకుడు.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. విశాఖపట్నం (visakhapatnam) సూర్యాబాగ్ ప్రాంతంలోని ఓ హోటల్‌లో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం వారిద్దరికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. వివరాలు..  నగరంలో కరాస ప్రాంతానికి చెందిన ఓ యువతి (20), వరంగల్‌ జిల్లా భూపాలపల్లికి (bhupalpally) చెందిన పలకల హర్షవర్ధన్‌ (21) పంజాబ్‌లోని ఓ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నారు. వీరిద్దరికి కాలేజ్‌లో పరిచయం ఉంది. అయితే హర్షవర్దన్‌ యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నట్టుగా చెబుతున్నారు. 

హర్షవర్దన్ శుక్రవారం విశాఖలోని హోటల్‌కు చేరుకున్నాడు. అతడు వచ్చిన విషయం చెప్పి.. మాట్లాడాలని కోరడంతో యువతి కూడా హోటల్‌కు వచ్చింది. అయితే అక్కడ యువతిని తనను పెళ్లి చేసుకోవాలని హర్షవర్దన్ కోరాడు. అయితే అందుకు యువతి నిరాకరించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే హోటల్‌ల్ గదిలోనే యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తనపై కూడా పెట్రోల్ (petrol) పోసుకుని నిప్పంటించుకున్నాడు.

హోటల్ గదిలో (hotel room) నుంచి అరుపులు, మంటలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే వారిద్దరిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించారు. ఇద్దరి శరీరాలు 60 శాతం మేర కాలిపోయినట్టుగా పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఇన్‌చార్జి హార్బర్‌ ఏసీపీ శిరీష సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తతం వారికి కేజీహెచ్‌లో (KGH) చికిత్స కొనసాగుతుందని తెలిపారు.
 

click me!