Operation kagar: కొన‌సాగుతోన్న ఆప‌రేష‌న్ క‌గార్‌.. తాజా ఎన్‌కౌంట‌ర్‌లో 20 మంది మృతి

Published : May 12, 2025, 07:32 PM IST
Operation kagar: కొన‌సాగుతోన్న ఆప‌రేష‌న్ క‌గార్‌.. తాజా ఎన్‌కౌంట‌ర్‌లో 20 మంది మృతి

సారాంశం

ఆప‌రేష‌న్ క‌గార్ కొన‌సాగుతోంది. దేశంలో మావోయిస్టుల‌ను లేకుండా చేయాల‌న్న సంక‌ల్పంతో ఉన్న కేంద్ర ప్ర‌భుత్వం ఆ దిశ‌గా వేగంగా అడుగులు వేస్తోంది. తెలంగాణ‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌రిహ‌ద్దుల్లో నిత్యం ఎన్‌కౌంట‌ర్‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా సోమ‌వారం భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది.   

బీజాపూర్‌ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. సోమవారం జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర పోరాటం జరిగింది. ఇందులో 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఇప్పటివరకు 11 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే 2026 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలనే లక్ష్యంతో ఉన్న‌ట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఆప‌రేష‌న్ క‌గార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలోనే మావోయిస్టుల‌కు కీలక ప్రాంతంగా ఉన్న క‌ర్రెగుట్ట‌ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు పూర్తిగా త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?