ఎమ్మెల్యే హత్య.. రెండు రోజులు సంతాప దినాలు

By sivanagaprasad kodatiFirst Published Sep 24, 2018, 7:00 PM IST
Highlights

విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మృతికి సంతాపంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. 

విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మృతికి సంతాపంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఇవాళ, రేపు సంతాప దినాలుగు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ  చేసింది.

అంతకు ముందు నక్సల్స్ చేతిలో దారుణ హత్యకు గురైన కిడారి, సివేరి మృతదేహలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. విశాఖ జిల్లా పాడేరులో భారీ వర్షంలోనే ఎమ్మెల్యే అంత్యక్రియలు నిర్వహించారు. సర్వేశ్వరరావు చితికి ఆయన పెద్ద కుమారుడు శ్రవణ్ నిప్పంటించారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం బట్టివలసలో గిరిజనుల కన్నీటి వీడ్కోలు మధ్య పూర్తయ్యాయి. 

అరకు ఘటన: అక్కడే నెల రోజులుగా మావోల శిక్షణ

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోలు వీళ్లే

చంద్రబాబు, నేదురుమల్లి.. మావోల పంజాకి చిక్కిన వారి జాబితా పెద్దదే

కిడారికి ముందే పోలీసుల హెచ్చరిక: నోటీసు ఇదే...

నాడు ఎమ్మెల్యే బాలరాజు కిడ్నాప్... నేడు ఎమ్మెల్యే కిడారి హత్య

click me!