MLA Durgam Chinnaiah: నలుగురులో మాట్లాడేటప్పుడూ ఆచీ తూటీ మాట్లాడాల్సి ఉంటుంది. ఇక నలుగురిలో తిరిగే నేతలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మాట జారిన తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగటం ఖాయం. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అలాంటి చిక్కుల్లోనే చిక్కుకున్నారు. రైతులు ఆకలితో కాదు.. ఆత్మహత్యలతో చావాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దూమారం రేపుతోంది.