టాప్ 8లో ఇండియాకి నిరాశ తప్పలేదు. ఆసియా- ఓషియానా నుంచి టాప్ 2గా ఫిలిప్పీన్స్, థాయిలాండ్ దేశాల అందగత్తెలు విజేతలుగా నిలిచి టాప్ 8లోకి ఎంట్రీ ఇచ్చారు.

మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికే మిస్ వరల్డ్ నిర్వాహకులు ఖండానికి 10 మంది చొప్పున టాప్ 40 కంటెస్టెంట్స్ ని ఎంపిక చేశారు. వీరిలో టాప్ 20ని ఎంపిక చేసే ప్రక్రియ ముగిసింది. టాప్ 20లో ఖండానికి 5 మంది చొప్పున అందగత్తెలని ఎంపిక చేశారు. 

మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ 20లోకి దూసుకుపోయారు. ఆసియా - ఓషియానా ఖండం నుంచి నందిని గుప్తా టాప్ 5 విజేతగా నిలిచారు. ఆసియా- ఓషియానా నుంచి ముందుగా ఆస్ట్రేలియాకి చెందిన జస్మినే స్ట్రింగర్ టాప్ 20లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఇండియా నుంచి నందిని గుప్తా పేరు ప్రకటించడంతో అక్కడ ప్రేక్షకుల నుంచి కేరింతలు మొదలయ్యాయి. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కి అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి కూడా నందిని గుప్తా టాప్ 20లో స్థానం దక్కించుకోవడంతో చప్పట్లతో అభినందించారు. 

ఆసియా- ఓషియానా టాప్‌ 5

ఆస్ట్రేలియా(జస్మినే స్ట్రింగర్‌), ఇండియా(నందిని గుప్తా), లెబనాన్‌(నడా కౌస్సా), ఫిలిప్పిన్స్(క్రిష్ణా గ్రావిడేజ్‌), థాయిలాండ్‌(సుచాతా చౌంగ్‌శ్రీ). 

టాప్ 8లో ఇండియాకి షాక్, నందిని గుప్తా అవుట్ 

కానీ టాప్ 8లో ఇండియాకి నిరాశ తప్పలేదు. ఆసియా- ఓషియానా నుంచి టాప్ 2గా ఫిలిప్పీన్స్, థాయిలాండ్ దేశాల అందగత్తెలు విజేతలుగా నిలిచి టాప్ 8లోకి ఎంట్రీ ఇచ్చారు. టాప్ 8లో ఖండానికి ఇద్దరేసి చొప్పున ఎంపిక చేస్తారు. దీనితో నందిని గుప్తాకి నిరాశ తప్పలేదు. మొత్తంగా మిస్ వరల్డ్ 2025లో నందిని గుప్తా ప్రయాణం ముగిసింది. 

టాప్‌ 8

అమెరికా: బ్రెజిల్‌, మార్టినిక్యూ 

ఆఫ్రికా : ఇథియోపియా, నమీబియా

యూరప్‌ : పోలాండ్‌, ఉక్రెయిన్‌ 

ఆసియా- ఓషియానా : ఫిలిప్పిన్స్, థాయిలాండ్‌.