ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు వేణు స్వామి, ఆయనలాగానే అషు  రెడ్డి కూడా ఏదో ఒక వివాదం అవుతూనే ఉంటుంది. గతంలో వేణు స్వామితో పూజలు చేయించి వార్తల్లోకెక్కిన అష్షు.. తాజాగా మరోసారి వైరల్ న్యూస్ అయ్యింది.

టీవీ షోలు, ఎక్స్ పోజింగ్ తో పాటు వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే నటి అషు రెడ్డి. ఆమె ఏది చేసిన వింతగానే ఉంటుంది. ఇక ఆర్జీవితో అషు రెడ్డి రచ్చ అంతా ఇంతా కాదు. టీవీ షోలలో ఆమె చేసిన హంగామ కూడా అంతా ఇంత కాదు. ఎప్పుడు ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూ ఉండే అషు రెడ్డి.. తాజాగా మరో ఆసక్తికరమైన ఘటనతో మళ్లీ వార్తల్లోకి వచ్చారు.

జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అష్షు.. రీసెంట్ గా అసోం రాష్ట్రంలోని ప్రసిద్ధ కామాఖ్య దేవి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామితో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా వేణు స్వామితో హోమాలు , పూజలు చేయించి వార్తలలో నిలిచింది అష్షు రెడ్డి.

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3, బిగ్‌బాస్ నాన్‌స్టాప్ వంటి రియాలిటీ షోల ద్వారా ప్రేక్షకులకు చేరువైన అషు రెడ్డి, టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లతో కూడా బిజీగా ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తరచూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇక ఆమె  గతంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ పెద్ద దుమారమే రేపింది.

తాజాగా కామాఖ్య ఆలయంలో ఆమె చేసిన పూజలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. వేణు స్వామితో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆ ఫొటోలు, వీడియోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. అవి క్షణాల్లోనే వైరల్ అవ్వడంతో పాటు రకరకాల కామెంట్లు కూడా వస్తున్నాయి. అషు రెడ్డి ఇప్పటికే పలు సార్లు వేణు స్వామిని కలిసి పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే.

జాతకాలు చెబుతూ పరిహార పూజలు నిర్వహించే వేణు స్వామి వద్ద ఇప్పటికే పలువురు స్టార్ సెలబ్రిటీలు పూజలు చేయించుకున్నట్లు సమాచారం. వేణు స్వామి కూడా సినిమా సెలబ్రిటీల జాతకాలు చెపుతూ..సంచలన విషయాలు వెల్లడిస్తూ ఉంటారు. ఈ విషయంలో ఆయన చాలా విమర్శలు ఫేస్ చేశారు. అంతే కాదు పలు కేసులు కూడా ఆయన ఫేస్ చేశారు.