ఆంధ్రప్రదేశ్ గుంటూరులోని పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా పేరు మీదుగా ఉన్న టవర్ కూల్చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ V Hanumantha Rao (వీహెచ్) స్పందించారు. ప్రజల దృష్టి మార్చడానికే బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రేపు రేపు తాజ్ మహాల్ తీసివేయమంటారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో చార్మినార్ ఉంది.. దాని ముస్లీంలు కట్టించారు దాని కూడా తీసేయమంటారా? అని ప్రశ్నించారు. పేరు మార్చడం కాదు. ప్రజల మనస్సు గెలుచుకొండని హితవు పలికారు.
పలు అంశాలపై తనదైన శైలిలో స్పందించే కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు (V Hanumantha Rao) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (etela rajender) విషయంలో తమ పార్టీ తప్పు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.