New Delhi: దేశంలో పులుల మరణాలు ఆందోళనను కలిగిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో 7 రోజుల్లో 5 పిల్లలతో సహా 7 పులులు మృతి చెందాయి. గత ఏడు రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో ఐదు పిల్లలతో సహా కనీసం ఏడు పులులు మరణించడంతో వాటి సంక్షేమం, సంరక్షణ చర్యలపై ఆందోళన వ్యక్తమవుతోందని జంతు ప్రేమికులు, పర్యావరణ పరిశోధకులు పేర్కొంటున్నారు.