న్యూడిల్లీ : భారత ప్రజాస్వామ్యంలో దేవాలయంలాంటి పార్లమెంట్ ను మోదీ సర్కార్ అత్యాధునిక హంగులతో నూతనంగా నిర్మించింది. రాజసం ఉట్టిపడేలా అద్భుతమైన అందాలు, సకల సౌకర్యాలతో నిర్మించిన ఈ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.