రైఫిల్ ఉన్నట్లు కనిపించగానే వారు కాల్పులు జరిపినట్లు సైనిక వర్గాలు తాజాగా వెల్లడించాయి. అనంతరం అక్కడికి చేరుకున్న గ్రామస్తులు కోపోద్రిక్తులు బలగాలపై తల్వార్ ల వంటి పెద్ద కత్తులతో దాడి చేసినట్లు తెలిపాయి. ఓ సైనికుడిని వారు గొంతు కోసి చంపారని పేర్కొన్నాయి. మొత్తం 13 మంది సైనికులకు కత్తి గాయాలయ్యాయని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించాయి.