land-for-jobs scam: లాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ కేసులో బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ను నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించనుంది. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాల కోసం భూముల కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ దర్యాప్తులో తేజస్వి యాదవ్ ను సీబీఐ గతంలో ప్రశ్నించింది.