Kerala blasts: కేరళ పేలుళ్ల ఘటనలో మరణాల సంఖ్య నాలుగుకు చేరింది. ప్రమాదం జరిగిన రోజు ఇద్దరు, మరుసటి రోజు ఒకరు మరణించగా.. తాజాగా 61 ఏళ్ల మహిళ చనిపోయారు. పేలుడు సంభవించిన సమయంలో ఆమెకు 70 శాతం కాలిన గాయాలు అయ్యాయి. అప్పటి నుంచి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆమె.. పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు.