Covid EX-gratia: కరోనా మహమ్మారికి బలైన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సాయం నేరుగా బాధిత కుటుంబాలకే చేరే విధంగా ఓ పోర్టల్ తీసుకొచ్చింది. కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు రూ. 50 వేలు పరిహారం చెల్లించడానికి ఆన్ లైన్ పోర్టల్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి. ఉషారాణి నోటిఫికేషన్ విడుదల చేశారు.