సూర్యాపేట టౌన్లోని కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జి వాష్రూమ్లో రామలింగ స్వామి(36) శవమై కనిపించాడు. అతను విషం తాగాడని తేలింది. రామలింగస్వామి ఖమ్మంలోని యెల్లందు నివాసి. అతని మృతదేహం వద్ద లభించిన సూసైడ్ నోట్ లో ఆన్లైన్లో పెట్టుబడులు, ఆర్థిక సమస్యలు, ఫైనాన్షియర్ వేధింపుల గురించి ప్రస్తావించినట్టు పోలీసులు గుర్తించారు.