Hyderabad: ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో వరదలు సంభవించాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్రమంలోనే అప్రమత్తమైన రాష్ట్ర ఆరోగ్య శాఖ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటోంది. అయితే, వర్షాలు తర్వాత కండ్లకలక బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం కండ్లకలక కేసులు పెరుగుతున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.