G20 Summit: 'ఢిల్లీ డిక్లరేషన్' సిద్ధం.. భారత్ చేరుకుంటున్న ప్రపంచ దేశాధినేతలు
G20 Summit Delhi: భారతదేశ జీ20 అధ్యక్ష పదవి సమ్మిళిత, నిర్ణయాత్మక, ప్రతిష్టాత్మక, కార్యాచరణ ఆధారితంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తమ అధ్యక్ష పదవీకాలంలో సమ్మిళిత, ప్రతిష్టాత్మక, కార్యాచరణ ఆధారిత, చాలా నిర్ణయాత్మకంగా ఉండాలనే ఆయన దార్శనికతకు అనుగుణంగా మేము ముందుకు సాగుతున్నామని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ అన్నారు.

G20 India 2023: దేశరాజధాని న్యూఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు, అమితాబ్ కాంత్ శుక్రవారం న్యూఢిల్లీ నాయకుల ప్రకటన గ్లోబల్ సౌత్, అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతును కలిగి ఉంటుందని అన్నారు. గ్లోబల్ సౌత్, వర్ధమాన దేశాల కోసం ప్రపంచంలో ఏ డాక్యుమెంట్ కూడా ఇంత బలమైన వాయిస్ కలిగి ఉండదని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ అన్నారు. ఢిల్లీ డిక్లరేషన్ సిద్ధంగా ఉందనీ, దీనిని ఆయా నాయకులకు అందిస్తామని చెప్పారు. బాలిలో జీ20 అధ్యక్ష పదవిని భారత్ చేజిక్కించుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా వృద్ధి, ఉత్పాదకత మందగించిన పరిస్థితిలో ఉందని అమితాబ్ కాంత్ అన్నారు.
'వసుధైవ కుటుంబకం' ఇతివృత్తంతో మన అధ్యక్ష పదవిని ప్రారంభించాలని భారతదేశం భావించిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అంటే ప్రపంచం ఒకే కుటుంబంగా భావిస్తున్నదని పేర్కొన్నాయి. భారతదేశ అధ్యక్ష పదవి సమ్మిళిత, నిర్ణయాత్మక, ప్రతిష్టాత్మక, కార్యాచరణ ఆధారితంగా ఉండాలని ప్రధాని మోడీ అన్నారు. తమ అధ్యక్ష పదవీకాలంలో సమ్మిళిత, ప్రతిష్టాత్మక, కార్యాచరణ ఆధారిత, చాలా నిర్ణయాత్మకంగా ఉండాలనే ఆయన దార్శనికతకు అనుగుణంగా మేము ముందుకు సాగుతున్నామని అమితాబ్ కాంత్ అన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, వాతావరణ చర్యలతో సహా జీ20 అధ్యక్ష పదవికి భారతదేశ కీలక ప్రాధాన్యతల గురించి ఆయన మాట్లాడారు.
169 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కేవలం 12 మాత్రమే పూర్తయ్యాయని, షెడ్యూల్ కంటే చాలా వెనుకబడి ఉన్నామని చెప్పారు. మనం 2030 యాక్షన్ పాయింట్ వద్ద ఉన్నాం, కానీ, మనం చాలా వెనుకబడి ఉన్నామని చెప్పారు. అందువల్ల, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను వేగవంతం చేయడం, అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం, ఆరోగ్యకరమైన ఫలితాలు, పోషకాహారం - ఇవన్నీ భారతదేశ అధ్యక్ష పదవికి చాలా కీలకమైనవని అమితాబ్ కాంత్ అన్నారు.
క్లైమేట్ యాక్షన్, క్లైమేట్ ఫైనాన్స్ నేపథ్యంలో గ్రీన్ డెవలప్ మెంట్ పై ప్రపంచం ముందడుగు వేయాలని కోరామని అన్నారు. దీనిలో తాము డ్రైవ్ చేయాలనుకునే అనేక భాగాలు ఉన్నాయనీ, అందువల్ల, గ్రీన్ డెవలప్మెంట్, క్లైమేట్ యాక్షన్, క్లైమేట్ ఫైనాన్స్ లు తమ మూడవ ప్రాధాన్యతగా చెప్పారు. ఎందుకంటే SDG, క్లైమేట్ యాక్షన్ రెండింటికీ ఫైనాన్స్ అవసరం, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ లో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు 21వ శతాబ్దపు బహుళపక్ష సంస్థలపై దృష్టి సారించడం చాలా ముఖ్యం' అని అమితాబ్ కాంత్ అన్నారు. దేశవ్యాప్తంగా 60 వేర్వేరు నగరాల్లో జరిగిన జీ20 సమావేశాల గురించి జీ20 చీఫ్ కోఆర్డినేటర్ హర్షవర్ధన్ శ్రింగ్లా మాట్లాడుతూ సహకార సమాఖ్య విధానానికి ఇది అత్యుత్తమ ఉదాహరణ అన్నారు.
గత ఏడాది డిసెంబర్ 1న జీ20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టామనీ, ఈ ఏడాది నవంబర్ 30న అధ్యక్ష పదవిని ముగిస్తామని చెప్పారు. ''మా అధ్యక్ష పదవీ కాలంలో దేశంలోని 60 వేర్వేరు నగరాల్లో 220కి పైగా జీ20 సమావేశాలను నిర్వహించాం. పాన్-ఇండియా జీ20 ప్రధాన మంత్రి విజన్ కు అనుగుణంగా, మేము భారతదేశంలోని ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో కనీసం ఒక జీ20 సమావేశాన్ని నిర్వహించాము. సహకార సమాఖ్య విధానానికి ఇదే అత్యుత్తమ ఉదాహరణ'' అని హర్షవర్ధన్ శ్రింగ్లా పేర్కొన్నారు. జీ20 సమావేశాలకు 125 దేశాల నుండి మొత్తం 1,00,000 మంది సందర్శకులు వస్తారని చెప్పారు. "వారిలో చాలా మందికి ఇది ఒక కొత్త భారతదేశ ఆవిష్కరణ. జీ20 అధ్యక్ష పదవి మన దేశానికి, మన పౌరులకు ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తుంది" అని హర్షవర్ధన్ ష్రింగ్లా అన్నారు.