ఓ మైనర్ బాలికపై తండ్రి, అంకుల్, తాతలే లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె నాలుగేళ్ల తరువాత పోలీసులకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది.
పూణే : కంటికి రెప్పలా కాపాడాల్సిన కుటుంబ సభ్యులే ఓ బాలికను కాటేశారు. వావివరుసలు మరచి, మృగాల్లా ప్రవర్తించి సొంత కూతురిపైనే పలు సందర్భాల్లో అఘాయిత్యం చేసి, ఆమె జీవితాన్ని నాశనం చేశారు. ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చి ప్రస్తుతం పూణేలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల బాలిక ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు చెప్పడంతో ఈ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పూణేలో ప్రస్తుతం బాలిక చదువుతున్న కాలేజీలో లైంగిక వేధింపులపై కమిటీ సభ్యుల ముందు ఆమె హాజరయ్యింది. అక్కడ ఆమె త గోడు వినిపించడంతో భయంకరమైన విషయాలు బయటపడ్డాయి.
బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూణే పోలీస్ స్టేషన్లో బుధవారం నిందితుల పై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే, ఆమె తండ్రిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. 2016, 2018 సంవత్సరాల్లో తాను యూపీ లో ఉన్న సమయంలో తన అంకుల్ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, తన తాతయ్య కూడా వేధింపులకు గురి చేసేవాడని బాలిక వాపోయింది. 2018లో పూణే వచ్చాక ఈ లైంగిక దాడి ఘటన గురించి తన తండ్రికి చెప్పుకోలేక.. ఓ చీటీలో రాసి ఇచ్చానని చెప్పింది.
ఒకరిని వదిలి మరొకరితో... ఏకంగా నలుగురితో వివాహం, నిత్య పెళ్లికొడుకు అరెస్ట్
అయితే, అది చదివిన తండ్రి.. తనను హింసించే వారిపై చర్యలు తీసుకుని.. తనకు ఓదార్పును, రక్షణను ఇవ్వడానికి బదులుగా తల్లి ఇంట్లో లేని సమయంలో తనపై పలు సందర్భాల్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై బాలిక తండ్రి తో పాటు ఆమె అంకుల్, తాతయ్యలపైన కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, 17 ఏళ్ల పాఠశాల బాలికపై పలుమార్లు అత్యాచారం చేసి, దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసిన ముగ్గురు వ్యక్తులను తిరుచ్చి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మరో ఇద్దరు వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు కొద్ది రోజుల క్రితం మైనర్ బాలికకు తమ బంధువుతో వివాహం జరిపించారు. అయితే పక్కా సమాచారంతో పోలీసులు ఆమెను బాల్యవివాహం నుంచి రక్షించి ప్రభుత్వ రక్షణా గృహంలో చేర్చారు. ఆమె ఇప్పుడు ఈ గవర్నమెంట్ హోంలోనే ఉంది.
అయితే, ఆ తర్వాత ఆమె మీద అత్యాచారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. ఈ విషయం ఆమె తండ్రికి తెలిసింది. దీంతో దీనిమీద నవంబర్ 12న తిరుచ్చి శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ)లో ఫిర్యాదు చేశారు. ఐదుగురు నిందితులు తన కుమార్తెను కిడ్నాప్ చేసి మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమెకు బలవంతంగా బీరు తాగించి, అత్యాచారం చేసి వీడియో తీశారు. ఆ తర్వాత, ఆమె తమతో శృంగారానికి నిరాకరిస్తే వీడియోను ప్రసారం చేస్తానని వారు ఆమెను బెదిరించారు.
అలా ఆమె మీద పదే పదే అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపాడు. దీంతో నవంబరు 13న మొత్తం మహిళా పోలీస్ స్టేషన్ ఐదుగురిపై కేసు నమోదు చేసింది. ఐదుగురిపై ఐపిసి, పోక్సో చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేయగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. బాలికను వివాహం చేసుకున్న వ్యక్తిపై కూడా బాల్య వివాహాల నిషేధ చట్టం, పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అతడు కూడా పరారీలో ఉన్నాడు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఈ వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత పక్కా సమాచారంతో ఆ వ్యక్తి చెర నుండి అమ్మాయిని రక్షించింది.