రష్మికకు చికెన్ బర్గర్ తిప్పలు.. నెటిజన్ల ట్రోల్స్..!

By telugu news teamFirst Published May 11, 2023, 1:53 PM IST
Highlights

 ప్రస్తుతం జనాల్లో రష్మికకు ఉన్న ఫాలోయింగ్ చూసి ఆమెతో యాడ్ చేయించారు. అయితే.. తాను శాఖహారిని అని చెప్పుకునే రష్మిక నాన్ వెబ్ బర్గర్ ఎలా తిన్నది అనేది ఇక్కడ ప్రశ్న. 

సెలబ్రెటీలు ఏ పని చేసినా ఆచితూచి వ్యవహరిస్తారు. ఎందుకంటే వారు ఏం చేసినా, ప్రజలు తమను గమనిస్తారు అనే విషయం వారికి కూడా తెలుసు. ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహిస్తారు. ధరించే దుస్తుల దగ్గర నుంచి, సినిమాల్లోని పాత్రలు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉంటారు. ఏ మాట మాట్లాడినా చాలా ఆలోచించి మాట్లాడతారు. ఇంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఒక్కోసారి తప్పులు దొర్లుతూ ఉంటాయి. ఇంకేముంది నెటిజన్లు వారిని ఏకిపారేస్తూ ఉంటారు. పాపం రష్మిక మందనా విషయంలో అదే జరిగింది.

రష్మకి ఇటీవల ఓ బర్డర్ యాడ్ ఇచ్చింది. సెలబ్రెటీలు ప్రకటనలు చేయడం సర్వ సాధారణం. వారు ప్రకటనలు చేస్తే, ప్రజలను ఆకర్షించవచ్చని అందరూ నమ్ముతారు. అందుకే క్రేజ్ ఉన్న స్టార్స్ తో ప్రకటనలు చేయిస్తారు. ఈ బర్డర్  యాడ్ విషయంలోనూ సదరు సంస్థ అదే చేసింది. ప్రస్తుతం జనాల్లో రష్మికకు ఉన్న ఫాలోయింగ్ చూసి ఆమెతో యాడ్ చేయించారు. అయితే.. తాను శాఖహారిని అని చెప్పుకునే రష్మిక నాన్ వెబ్ బర్గర్ ఎలా తిన్నది అనేది ఇక్కడ ప్రశ్న. తాను నాన్ వెజ్ అసలు తినను అని ఆమె స్వయంగా చెప్పారు. తినను అని చెప్పి ఇప్పుడు బర్గర్ ఎలా తిన్నారు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

 

నాన్ వెజ్ తినను అని అబద్ధం చెప్పావా లేదంటే.. వెజ్ బర్గర్ తిని, నాన్ వెజ్ బర్గర్ కి ప్రకటన ఇచ్చావా అని ప్రశ్నిస్తున్నారు. ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం అని ప్రశ్నిస్తున్నారు.ప్రజలను మోసం చేస్తున్నారా అంటూ మండిపడుతున్నారు.

ఈ విషయంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కొందరు రష్మికపై విమర్శలు చేస్తుండగా.., మరికొందరు నటికి మద్దతు పలుకుతున్నారు. 'సెలబ్రిటీలందరూ తాము ప్రమోట్ చేసే వస్తువులను ఉపయోగించరు. ప్రచార అంబాసిడర్ మాత్రమే.' అని అంటున్నారు.  ఆమె కేవలం ప్రకటన చేసింది అంతేకానీ, బలవంతంగా తినమని ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు, కనీసం తినమని కూడా ఎక్కడా చెప్పలేదు కదా , అది కేవలం ప్రకటన మాత్రమే దానిని ఆమెని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటూ కొందరు రష్మికకు మద్దతుగా నిలుస్తున్నారు.


 

click me!