
ఇటీవల భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ 2008 తర్వాత ఒక్కరోజులోనే అత్యధికంగా పెరిగినట్టు అంచనాలు. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం రూ.1.41 లక్షలు, 24 క్యారెట్ల బంగారం రూ.1.53 లక్షల వద్ద కొనసాగుతోంది. వెండి ధర కేజీకి రూ.3 లక్షల వద్ద స్థిరంగా ఉంది. ఇవాళ దేశీయ మార్కెట్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.