Aug 9, 2019, 12:24 PM IST
మాజీ ఎంపీ వివేక్ శుక్రవారం నాడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో న్యూఢిల్లీలో బీజేపీలో చేరారు.ఈ ఏడాది ఏప్రిల్ లో టీఆర్ఎస్కు వివేక్ దూరమయ్యారు. పెద్దపల్లి ఎంపీ స్థానం నుండి టీఆర్ఎస్ టిక్కెట్టు దక్కని కారణంగా ఆయన ఆ పార్టీకి దూరమయ్యాడు. కాంగ్రెస్ పార్టీ వివేక్ ను పార్టీలో చేరాలని ఆహ్వానించారు. కానీ, వివేక్ బీజేపీలో చేరాడు.
న్యూఢిల్లీలో తొలుత రామ్ మాధవ్ తో వివేక్ భేటీ అయ్యాడు. ఆ తర్వాత ఆయన అమిత్ షా తో భేటీ అయ్యారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలతో కూడ వివేక్ సమావేశమయ్యారు.