మా నాయకుడికి అనుకున్న పదవి దక్కలేదు...టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యయత్నం

Jan 29, 2020, 6:52 PM IST

తమ నాయకుడి స్థాయికి తగ్గ పదవి రాలేదని మనస్తాపంతో సూర్యాపేట 5 వ వార్డు కౌన్సిలర్ షేక్ బాషా మియా అనుచరుడు ఆత్మహత్యయత్నం చేశాడు. వైస్ చైర్మన్ మొదట హామీ ఇచ్చి ఇప్పుడు పదవి ఇవ్వకపోవడం పై కౌన్సిలర్ అసంతృప్తితో ఉన్నాడు. కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయాలనే యోచనతో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశాడు. సమావేశం జరుగుతుండగానే సూర్య నాయక్ అనే వీరాభిమాని పెట్రోల్ పోసుకున్నాడు. తోటి కార్యకర్తలు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.