ఇకపై టీఆర్ఎస్ కాదు బిఆర్ఎస్... కేసీఆర్ అధికారిక ప్రకటన

Oct 5, 2022, 2:34 PM IST

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చినట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి పార్టీ సర్వసభ్య సమావేశం చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని అధ్యక్షుడు కేసీఆర్   చదివి వినిపించారు. అలాగే టీఆర్ఎస్ పేరు మార్పుకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా అందించారు. దీంతో ఇప్పటినుండి టీఆర్ఎస్ అధికారికంగా బిఆర్ఎస్ గా మారింది