లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఏటిఎం మిషన్ లో నాగుపాము.. మనీ తీస్తే కాటు ఫ్రీ...

May 9, 2020, 4:48 PM IST

ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్ లో వింత సంఘటన చోటు చేసుకుంది. లాక్ డౌన్ వల్ల సందడి లేకపోవడంతో ఓ విషసర్నం ఐసిఐసిఐ ఏటిఎంలోకి వచ్చింది. దాన్ని గమనించిన కస్టమర్ ఏటీఎం సెక్యూరిటీకి చెప్పడంతో వెంటనే అలర్ట్ అయి ఏటిఎం తలుపులు మూసేశారు. అయితే ఎటు పోవాలో తోచని పాము ఎంచక్కా ఏటిఎం మిషన్ లోకి దూరింది. ఇప్పుడు దాన్నెలా బైటికి తీయాలా అని తలలు పట్టుకున్నారు అక్కడివారు.