కేరళ విమాన ప్రమాదం : ఇంతకీ అసలేం జరిగింది?

Aug 8, 2020, 12:54 PM IST

కేరళలో గతరాత్రి జరిగిన విమాన ప్రమాదం భయాందోళనలకు గురి చేసింది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 19 కి చేరుకుంది. వందే భారత్ మిషన్ లో భాగంగా దుబాయ్ నుండి కేరళలోని కోజికోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం రాత్రి 7.40 నిమిషాలకు లాండింగ్ అవుతుండగా ప్రమాదానికి గురయ్యింది. భారీ వర్షం కారణంగా పైలట్ కి రన్ వే కనపడక 30 అడుగుల లోతుకి పడిపోయి విమానం రెండు ముక్కలు అయింది. మొత్తం విమానంలో 195 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది వున్నారు. పైలట్, కో పైలట్ కూడా మృతి చెందారు.