విశాఖ నగరానికి మరో మణిహారం... సీ హ్యారియర్ మ్యూజియం

May 10, 2023, 2:48 PM IST

తీర నగరం విశాఖపట్నానికి మరో అదనపు ఆకర్షణ వచ్చి చేరుతున్నది. ఆర్‌కే బీచ్ రోడ్‌లో మే 11వ తేదీన సీ హ్యారియర్ మ్యూజియాన్ని ప్రారంభిస్తున్నారు. రూ. 10 కోట్ల వ్యయంతో విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ మ్యూజియాన్ని అభివృద్ధి చేసింది. డిఫెన్స్, ఏవియేషన్ రంగంలో ఆధునిక సాంకేతికతలనూ ఈ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచడం విశేషం. భారత నావికా దళం, దాని ఘనమైన చరిత్రకు నివాళిగా ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తున్నారు.