వీరి పరిస్థితి దయనీయం.. ఎలాంటి నీరు తాగుతున్నారో.. (చూడండి)

May 11, 2020, 10:19 AM IST

విశాఖ జిల్లా, కొయ్యూరు మండలం రామ రాజు పాలెం గ్రామంలో గిరిజన ప్రజలు త్రాగునీటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊర్లో  నళ్లాలు పనిచేయడం లేదని, పంచాయతీ కార్యదర్శి విధులకు రావడం లేదు కాబట్టి మా సమస్యలు పరిష్కరించలేదని వారు ఆవేదన చెందారు. 25  రొజులనుంచి స్థానిక ఉన్నగెడ్డలో నుంచి నీరు తీసుకొని తాగాల్సి వస్తుందని వాపోయారు. తక్షణమే స్పందించి గ్రామంలో కుళాయిలు మరమ్మతులు చేపట్టి త్రాగు నీరు అందించాలని వారు కోరుతున్నారు.