ఛలో అసెంబ్లీ : సునామీలా కదులుతున్న రైతులు...

Jan 20, 2020, 2:35 PM IST

రాజధాని ఐకాసా, అమరావతి జేఏసీ ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి పిలుపు మేరకు తుళ్లూరు రాజధాని రైతులు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తుళ్లూరు రైతులతో కలసి అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్నారు. పోలీసులు అడ్డుకుంటున్నా వారిని దాటుకుంటూ రైతులు ముందుకు సాగుతున్నారు. పొలాల్లోనుండి, గట్లమీదినుండి సచివాలయం వైపుగా రైతులు కదులుతున్నారు.