నిరుద్యోగులకు అండగా తెలుగు యువత... నీటిలో దిగి వినూత్న నిరసన

Sep 18, 2022, 2:24 PM IST

గుంటూరు : వైసిపి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష టిడిపి వినూత్న నిరసన చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలంటూ గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో జలదీక్ష చేపట్టారు.  గుంటూరు తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణతో పాటు ఇతర నాయకులు గుంటూరు ఛానెల్ లోని నీటిలో దిగి నిరసన తెలిపారు.  'జాబులు ఎక్కడ జగన్?' అంటూ నీటిలోనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.