లోకేష్ పాదయాత్ర సందర్భంగా కుప్పం సభకు టీడీపీ భారీ ఏర్పాట్లు (వీడియో)

Jan 27, 2023, 11:51 AM IST

కుప్పం : తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో ఏపీలో పాదయాత్ర ఈ రోజునుంచి ప్రారంభించనున్నారు. కుప్పం నుంచి పాదయాత్రను మొదలుపెట్టి.. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కుప్పంలో లోకేశ్‌ పాదయాత్రకు టీడీపీ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.