అకాల వర్షాలతో అన్నదాతల విలవిల... దెబ్బతిన్న పంటపొలాలకు కొల్లు రవీంద్ర

Mar 21, 2023, 4:44 PM IST

మచిలీపట్నం : ఇటీవల కురిసిన అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను ధైర్యం చెప్పారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను స్థానిక టిడిపి నాయకులతో కలిసి వెళ్ళి పరిశీలించారు రవీంద్ర. రైతులతో మాట్లాడి పంటనష్టం గురించి తెలుసుకున్న మాజీ మంత్రి ప్రభుత్వం వెంటనే అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేసారు. మచిలీపట్నం నియోజకవర్గంలో 6000 ఎకరాల పంటనష్టం జరిగిందని... ముఖ్యంగా మినుము, వేరుశనగ రైతులు ఎక్కువగా నష్టపోయారని అన్నారు.