శారదాదేవి సన్నిధిలో... వైభవంగా చిన్నారుల సామూహిక అక్షరాభ్యాస పూజలు

Oct 2, 2022, 2:59 PM IST

విశాఖపట్నం : ఇవాళ (ఆదివారం) అమ్మవారి జన్మనక్షత్రం (మూల) సందర్భంగా విశాఖపట్నం శారదపీఠం భక్తులతో కిటకిటలాడుతోంది. నిత్యం శారదాదేవి స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చే రాజశ్యామల అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా శారదా పీఠానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా వందలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు సరస్వతి పూజలో పాల్గొన్నారు. అమ్మవారి సన్నిధిలో చాలామంది చిన్నారులు అక్షరాభ్యాసం చేసారు.   

ఈ పూజాకార్యక్రమాల్లో పాల్గోన్న శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ... నేటి చిన్నారులకు మంచి మేధాశక్తిని ప్రసాదించి దేశానికి ఉపయోగపడేలా ప్రయోజకులను చేయాలని అమ్మవారిని కోరుకున్నానని అన్నారు. శారదాదేవి ఆలయంలో ఎల్లపుడూ అక్షరాభ్యాసం జరుగుతుందని... తమ పిల్లలతో వచ్చి తల్లిదండ్రులు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించుకోవచ్చని అన్నారు.