ఏపీ బడ్జెట్ 2023-24 ప్రతులకు ఆర్థిక మంత్రి బుగ్గన ప్రత్యేక పూజలు...

Mar 16, 2023, 9:37 AM IST

అమరావతి :ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ 2023-24 ప్రతులకు సచివాలయంలోని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  తిరుపతి తిరుపతి దేవస్థానం అర్చకులు బడ్జెట్ ప్రతులను స్వామివారి చిత్రపటం ముందుంచి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గనకు ఆశీర్వచనం అందించి బడ్జెట్ ప్రతులను అందించారు.ఈ పూజా కార్యాక్రమంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్ రావత్ తో పాటు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ... బడుగు బలహీనవర్గాలు, పేదలకు మేలు చేసేలా బడ్జెట్ ను రూపొందించామని అన్నారు. విద్య, వైద్యం, మౌళిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ పథకాలకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చామన్నారు.