మద్యం తాగవద్దు అన్నందుకు బీర్ సీసాతో దాడి

May 27, 2023, 11:50 AM IST

ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి - మద్యం దుకాణం వద్ద తాగొద్దన్న సేల్స్ మెన్ పై బీరు సీసాతో  దాడి చేసి అనంతరం తనకు తాను పొడుచుకున్న మందుబాబు మంగేశ్వరరావు. ఈలప్రోలు రహదారిలో ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ దాడి ఘటనలో సేల్స్ మెన్ నాగ లవకుమార్ ఛాతి, పొట్టపై గాయాలయ్యాయి...ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద వాటర్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్ లతో పాటు అన్ని ఆహార పదార్థాలు లభ్యం కావడం తో మద్యం కొనడానికి వచ్చినవారు అక్కడే తాగడం తో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయని, వీటిపైనా పోలీసులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు...  .