మంగళగిరిలోని AIIMS Mangalagiri స్నాతకోత్సవానికి విద్యాశాఖ మంత్రి Nara Lokesh అతిథిగా హాజరయ్యారు. ప్రాణాలు కాపాడే వైద్యులను ప్రజలు దేవుళ్లుగా కొలుస్తారని, వైద్య వృత్తిని మరింత సామాజిక బాధ్యతతో నిర్వర్తించాలని ఆయన సూచించారు. 2015లో చిన్న స్థాయిలో ప్రారంభమైన ఎయిమ్స్ మంగళగిరి ఈ స్థాయికి ఎదగడం గర్వకారణమని లోకేష్ పేర్కొన్నారు.