విశాఖ ఎల్టీపాలిమర్స్ : బ్లాస్ట్ అవుతుందన్న వదంతులు నమ్మొద్దు.. అవంతి శ్రీనివాస్

May 8, 2020, 4:06 PM IST

విశాఖపట్నం, గోపాలపట్నం ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో జరిగినరసాయన లీక్ ప్రమాదంపై  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు  గుజరాత్ నుంచి వచ్చిన కాలుష్య నివారణ నిపుణులుతో  సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిస్థితి ఎప్పుడు అదుపులోకి వస్తుందని కాలుష్యం నిపుణులను ఆరా తీశారు. ఇప్పటికే 50 శాతం వరకు స్టైరన్ పొలిమిరైజ్ జరిగిందని రేపు ఉదయానికి పూర్తి స్థాయిలో జరుగుతుందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. ఇలాంటి ప్రమాదం పునరావృతం కాకుండా చూడాలని మంత్రి  LG పాలిమర్ యాజమాన్యాన్ని ఆదేశించారు.