ప్లకార్డు చేతబట్టి పాదయాత్రగా అసెంబ్లీకి... వైసిపి రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసన

Mar 15, 2023, 10:34 AM IST

అమరావతి : వైసిపి రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో నిరసనకు దిగారు.తన నియోజకవర్గ సమస్యలపై ప్లకార్డు ప్రదర్శిస్తూ అసెంబ్లీ సమీపంలోని ఫైర్ స్టేషన్ నుండి నడుచుకుంటూ చేరుకున్నారు కోటంరెడ్డి. ఇలాగే ప్లకార్డు ప్రదర్శిస్తూ అసెంబ్లీకి చేరుకున్న కోటంరెడ్డి సభలోనూ అలాగే నిలబడి నిరసన తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని కోటంరెడ్డి స్పీకర్ ను కోరుతున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన నాటినుండి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికై పోరాడుతున్నానని... అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలనే ఇలా నిరసన తెలియజేయాల్సి వస్తోందని ఎమ్మెల్యే కోటంరెడ్డి పేర్కొన్నారు.