గిరిజన, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ ఏడాదిన్నరగా చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేతలు చేస్తున్న అవమానాలు, బూతులు ప్రజల్లో కడుపుమంటను పెంచాయని తెలిపారు. తిరుమల లడ్డూ కల్తీ అంశాన్ని మళ్లించేందుకే దిగజారుడు భాష వాడుతున్నారని విమర్శించారు.