మేమింతే..సామాజికదూరం పాటించం...రేషన్ కోసం గుంపులుగా జనం....

Mar 30, 2020, 10:59 AM IST

లాక్ డౌన్ ప్రకటించి ఇళ్లలో కూర్చోండంటే మనకు తోచదు..సరదాగా రోడ్లమీదికొస్తాం..గ్రౌండ్లలో క్రికెట్ ఆడతాం..పోలీసులు పట్టుకుని కొడితే గాయి గాయి చేస్తాం..నిత్యావసరాల కోసం రోడ్లమీదికొస్తే ఇలాగా కొట్టేది అంటూ తిట్టిపోస్తాం..రోజూ పొద్దున్నే రేషన్ కోసం వదిలితే మాత్రం గుంపులుగా చేరి ముచ్చట్లు పెట్టుకుంటాం..ప్రభుత్వ నిబంధనలేవీ పాటించం...మనకోసం కనీసజాగ్రత్తలు తీసుకోం..రేషన్ కోసం ఉదయాన్నే బారులు తీరారు కానీ ఒక్కరు కూడా సామాజికదూరాన్ని పాటించట్లేదు. ఇలాంటి వాళ్లకు బడితెపూజ చేస్తే తప్పేంటి..